గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 04:12 PM IST
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఫ్లైఓవర్‌ని మూసేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతోపాటు సైబరాబాద్‌ సీపీని ఆదేశించామన్నారు. ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ కంట్రోలర్స్‌తోపాటు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్లైఓవర్ పై స్పీడ్ కంట్రోలర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై నుంచి కారు కిందపడిన ఘటనలో.. రోడ్డు పక్కన నిలబడ్డ సత్యవాణి  మృతి చెందారు. సత్యవాణి కూతురు ప్రణీత, ఆటో డ్రైవర్ బాలునాయక్‌, కుబ్రా అనే మహిళ గాయడ్డారు. వీరికి కేర్‌ ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అటు మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌.  గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడిపోయిన ఘటనతో  ఫ్లైఓవర్ నిర్మాణంపై వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఓ ప్రమాదం ఇదే ప్రదేశంలో జరగడంతో నిర్మాణ పరంగా ఏమైనా లోపాలున్నాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అని మరోసారి అధ్యయనం చేస్తామని సీపీ స్పష్టం చేశారు.