సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం… ముఖ్య అతిథిగా RSS చీఫ్

  • Published By: veegamteam ,Published On : September 7, 2019 / 08:44 AM IST
సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం… ముఖ్య అతిథిగా RSS చీఫ్

హైదరాబాద్ లో గణేష్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడా చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నెల 12న ఉదయం 8 గంటలకు శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది.

అంతేకాదు ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. అయితే శోభాయాత్రలో సినిమా పాటలు, డీజేలు, డాన్సులు లాంటివి చేయకూడదని ఉత్సవ కమిటీ సభ్యులు ఆదేశించారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి హైదరాబాద్‌ లో జరిగే గణేష్ శోభాయాత్రకు 40 లక్షల మంది వరకు రావచ్చని అంచాన వేస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇక నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 36 క్రేన్లను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగే శోభాయాత్ర రూట్ లో విగ్రహాలు వెళ్లే చోట అడ్డంగా ఉన్న వైర్లు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను 48 గంటల్లోపు పూర్తి చేస్తున్నారు.