ఎన్కౌంటర్: రాముడిలా, కృష్ణుడిలా మారక తప్పదు
దేశమంతా ఎదురుచూసిన సంఘటన జరిగింది. దిశా హంతకులకు శిక్ష పడింది. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్ల పై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేశారు తెలంగాణ పోలీసులు. గతంలో స్వప్నిక ప్రణీతలపై యాసిడ్ దాడి నిందితులకు ఎన్కౌంటర్ చేసినట్లే సీన్ రిపీట్ అయ్యింది.
నిందితులైన అరిఫ్ పాషా, శివ, చెన్నకేశవులు, నవీన్లను పోలీసులు ఈ తెల్లవారు జామున సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు. క్షణాల్లో విగతజీవులుగా మారిపోయారు నిందితులు. అందరికీ రోజుల వ్యవధిలోనే క్యాపిటల్ పనిష్మెంట్ విధించారు.
‘త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ నేటి యుగంలో రాక్షసులు మన సీతలను, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాంటప్పుడు రాముడిలా, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తూ ఉంటాం?’ అని కైలాశ్ సత్యార్థి హిందీలో ట్వీట్ చేశారు.
त्रेतायुग के रावण और द्वापर के दु:शासन ने तो भारत की बेटियों का सिर्फ़ अपहरण और चीरहरण किया था,लेकिन आज के राक्षस हमारी सीताओं और द्रौपदियों से सामूहिक बलात्कार करके उन्हें ज़िंदा जला रहे हैं।आख़िर हम कब तक राम और कृष्ण बनने के बजाय केवल उनकी पूजा-उपासना का ढोंग करते रहेंगे?
— Kailash Satyarthi (@k_satyarthi) December 6, 2019