ఊరుకు పోదాం ఓటు వేద్దాం చలో చలో : NH పై భారీ ట్రాఫిక్

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఊర్లకు వెళతామో అంతకంటే ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ప్రజలు అంతకంటే ఎక్కువగా పోటెత్తారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 07:01 AM IST
ఊరుకు పోదాం ఓటు వేద్దాం చలో చలో : NH పై భారీ ట్రాఫిక్

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఊర్లకు వెళతామో అంతకంటే ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ప్రజలు అంతకంటే ఎక్కువగా పోటెత్తారు.

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఊర్లకు వెళతామో అంతకంటే ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ప్రజలు అంతకంటే ఎక్కువగా పోటెత్తారు. ఈ క్రమంలో స్వంత ఊర్లకు వెళ్లే క్రమంలో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. 
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ

హైదరాబాద్‌ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు వేసేందుకు నగరం నుంచి ఓటర్లు మంగళవారం (ఏప్రిల్ 9) రాత్రి నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరటంతో బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్‌ జామ్‌ భారీగా అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టోల్‌ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. గంటలకొద్ది వెయిట్ చేయటంతో టోల్‌గేట్‌ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గేట్‌ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా రైల్వే స్టేషన్లలో కూడా భారీ రద్దీ నెలకొంది. ఏపీకి వెళ్లే ఓటర్లు పెద్దఎత్తున రావడంతో రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. 
Read Also : చైతన్యం వచ్చింది : పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు