మద్యం మత్తు : గర్భిణి భార్యను చంపేశాడు

కులాలు వేరని పెద్దలు వద్దన్నా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..పేదరికంతో కూలీనాలీ చేసుకుంటు సంతోషంగా వుండే వారి దాంపత్యంపై మద్యం మహమ్మారి కాటువేసింది. మద్యం మత్తులో గర్బిణిగా వున్న భార్యని దారుణంగా చంపేశాడు.

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 10:37 AM IST
మద్యం మత్తు : గర్భిణి భార్యను చంపేశాడు

కులాలు వేరని పెద్దలు వద్దన్నా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..పేదరికంతో కూలీనాలీ చేసుకుంటు సంతోషంగా వుండే వారి దాంపత్యంపై మద్యం మహమ్మారి కాటువేసింది. మద్యం మత్తులో గర్బిణిగా వున్న భార్యని దారుణంగా చంపేశాడు.

 

పెద్దలను ఎదిరించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు
కూలి నాలీ చేసుకునే వారిని మద్యం కాటు వేసింది
మందు మత్తులో గర్భిణి భార్యను చంపేశాడు 

హైదరాబాద్ : కులాలు వేరని పెద్దలు వద్దన్నా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..పేదరికంతో కూలీనాలీ చేసుకుంటు సంతోషంగా వుండే వారి దాంపత్యంపై మద్యం మహమ్మారి కాటువేసింది. మద్యం మత్తు మనిషిని పశువులా మార్చేస్తుండగా..పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. మందుతాగి వివేకం కోల్పోతున్న క్రమంలో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకడటంలేదు. ఈ క్రమంలో  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చేతులా చంపేశాడు ఓ భర్త. మద్యానికి బానిసై భార్యను రోజూ వేధిస్తూ.. అదే మద్యం మత్తులో గర్భిణిగా వున్న భార్యను విచక్షణ మరచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో నగరంలోని ఈస్ట్ మారేడ్‌పల్లి వాల్మీకినగర్‌లో జనవరి 21న జరగగా రెండు రోజుల తరువాత బయటపడింది. 

మారేడ్‌పల్లిలోనే ఓ బియ్యం షాపులో పనిచేస్తున్న సన్నీ వాల్మీకినగర్‌లో నివాసముంటున్నాడు. ఆ ప్రాంతానికే చెందిన సత్యవతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లి అంగీకరించకపోయినా 2013 ఫిబ్రవరిలో పెద్దల్ని ఎదురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం బాగానే వున్నా రాను రాను మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో చీటికీ మాటికీ భార్యతో ఘర్షణ పడుతు వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో 21న సన్నీ ఫుల్లుగా తాగి ఇంటికి రావటం..భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. ఆమె గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. 22 తేదీ అంతా మద్యం తాగుతు ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో సన్నీని చూసిన తండ్రి కోడలి గురించి అడిగాడు. దీంతో సత్యవతిని చంపేశానని చెప్పాడు. తాగి మాట్లాడాడేమో అనే అనుమానంతో స్థానికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తీయగా సత్యవతి చనిపోయి వుంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపి.. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.