కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ : ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతీవార్డుకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ సెంటర్లలో ఆర్వోలదే తుది నిర్ణయం. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడనున్నాయి
రాష్ట్ర వ్యాపంగా 134 కౌంటింగ్ సెంటర్లు
120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో బరిలో నిలిచిన వారి భవితవ్యం శనివారం (జనవరి 25, 2020) తేలనుంది. ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాపంగా 134 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభజించి బండిల్ష్గా కడతారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7గంటల వరకే చేరుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచి, బ్యాలెట్ బాక్సులు పరిశీలించి, ఆ తర్వాత కౌంటింగ్ హాల్లోకి తరలిస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్ట్రాంగ్ రూమ్లోనే తెలియజేయాలని.. ఆలస్యంగా వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల పరీశీలన, తిరస్కరణ నుండి ఫలితాలు ప్రకటించే వరకు.. రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం కానుంది.
మధ్యాహ్నంలోపే ఫలితాలు వెల్లడి
బ్యాలెట్ పత్రాలు అయినప్పటికీ ఫలితాలు త్వరగా వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 30 వార్డులలోపు ఉన్న మున్సిపాలిటీలే సగానికి పైగా ఉండటంతో మధ్యాహ్నంలోపే ఫలితాలు వెలువడనున్నాయి. కేవలం పది వార్డులు ఉన్న వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూర్, చండూరు, ఆలంపూర్ లాంటి చోట్ల.. ఉదయం 11 గంటల వరకే రిజల్ట్ రానుంది. 60 వార్డులు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశముంది. అటు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ విధించారు.