కన్నీటి వీడ్కోలు : మహాప్రస్థానంలో సత్యనాదెళ్ల తండ్రి అంత్యక్రియలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

  • Published By: veegamteam ,Published On : September 15, 2019 / 06:19 AM IST
కన్నీటి వీడ్కోలు : మహాప్రస్థానంలో సత్యనాదెళ్ల తండ్రి అంత్యక్రియలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలను సత్య నాదెళ్ల పూర్తి చేశారు. తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ల ఆదివారం(సెప్టెంబర్ 15,2019) ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని నివాసానికి చేరుకున్నారు. నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సత్య నాదెళ్ల రాక కోసం.. తండ్రి మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌.. 1962 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. 1983-85 మధ్య అప్పటి సీఎం ఎన్టీఆర్‌ దగ్గర పనిచేశారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో యుగంధర్ కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో.. ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామంలో జన్మించిన యుగంధర్‌.. తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య ప్రభావతి 2015లోనే మరణించారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న విషయం తెలిసిందే. 

పీఎంవో కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పలు కీలకమైన హోదాల్లో యుగంధర్ పని చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. గ్రామీణాభివృద్ధిలో ఎన్నో పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. 1988-1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీకి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.