సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సు బీభత్సం

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 04:52 AM IST
సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సు బీభత్సం

సికింద్రాబాద్ : సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. మందు కొట్టి డ్రైవింగ్ చేశాడని ప్యాసింజర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సికింద్రబాద్‌లో చోటు చేసుకుంది. జనవరి 28వ తేదీ ఉదయం సికింద్రాబాద్ నుండి మెహిదీపట్నంకు సెట్విన్ బస్సు వెళుతోంది. బస్సు వేగంగా వెళుతూ..ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. అందున్న ప్రయాణీకుల తలలకు..చేతులకు..మోకాళ్లకు గాయాలయ్యాయి. ఓ ఆటో కూడా ధ్వంసమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఇధి చోటు చేసుకుందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.