కళ్లు చెదిరిపోయాయ్ : 3 కిలోల గోల్డ్ బిస్కెట్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరిపోయే బంగారం పట్టుబడింది. వాహనాల్ని సోదాలు చేస్తున్న క్రమంలో పోలులు ఏకంగా మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వాహనాలను చెక్కింగ్ చేస్తున్న క్రమంలో సుల్తాన్బజార్ పోలీసులు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాచిగూడ చౌరస్తా వద్ద డీఐ లక్ష్మణ్ ఏప్రిల్ 24 ఉదయం 6.30 గంటలకు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సుల్తాన్బజార్ నుంచి కాచిగూడ చౌరస్తా వైపుకు వస్తున్న ఓ బైక్ (బైక్ నంబర్ ఏపీ07సీపీ-4165)ను చెక్ చేయగా 30 గోల్డ్ బిస్కెట్లను గుర్తించారు. ఒక్కో బిస్కెట్ 100 గ్రాములు ఉన్నాయని మొత్తం మూడు కిలోలున్నాయని సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్ తెలిపారు. కాగా బైక్ పై ఉన్న వ్యక్తి అనంతపురానికి చెందిన ఎం.బద్రీనాథ్ అనే 36 ఏళ్ల వ్యక్తిగా అని తెలిపారు. బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలుగానీ, బిల్లులుగానీ బద్రీనాథ్ చూపించకపోవటంతో బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బద్రీనాథ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ బంగారం ఎవరికి చెందిని అనే కోణంలో విచారిస్తున్నారు.