స్వామి మీరే రక్షించాలి : చిన జియ్యర్ ను వేడుకొన్న వీఆర్వోలు

  • Published By: chvmurthy ,Published On : April 13, 2019 / 03:54 PM IST
స్వామి మీరే రక్షించాలి : చిన జియ్యర్ ను వేడుకొన్న వీఆర్వోలు

హైదరాబాద్: రాష్ట్రంలో రెవిన్యూ శాఖను రక్షించాలని వీఆర్వోల సంఘం చినజియ్యరు స్వామివారిని వేడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గత పది రోజుల నుండి రెవిన్యూ శాఖను రద్దు చేస్తాం అని లేదా ఇతర శాఖల్లో విలీనం చేస్తాం అని ప్రకటనలు చేయటం పట్ల ఆందోళన చెందిన వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కోండ సతీష్  కొంతమంది ప్రతినిధులతో శనివారం ముచ్చింతల్ లోని చిన జియ్యరు స్వామిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …రెవిన్యూ శాఖను రద్దు చేస్తాం అని సీఎం కేసీఆర్ అనటంతో  రెవిన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఈ శాఖ ను రద్దు చేస్తే మన పరిస్థితి ఏంటనే డోలాయమాన స్ధితిలో కుటుంబాలు ఉన్నాయని వారు చెప్పారు.

ప్రభుత్వం రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో ఎలాంటి మార్పులు తెచ్చిన మేము సేవ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం అని వారు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో మాత్రమే మీటింగ్ లు పెట్టి చర్చిస్తున్నారు కానీ మమ్ములను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  చినజియ్యరు స్వామి వారు చొరవ తీసుకుని  ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.