సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన బాలుడు గుండెపోటుతో మృతి
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. యూసుఫ్గూడ జవహర్నగర్లో రాజయ్య, కొడుకు దేవీ శైలేష్ (10) నివాసముంటున్నారు. రాజయ్య పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్లు, పేపర్ల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
దేవీ శైలేష్ చీకటి మామిడి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే సంక్రాంతి సెలవులకు 2020, జనవరి 11న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. రెండు రోజులుగా గుండెనొప్పి వస్తోందని దేవీ శైలేష్ బాధపడుతున్నాడు. ఆదివారం నొప్పి విపరీతంగా రావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శైలేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.