హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి తిరుచిరాపల్లి మధ్యలో వారాంలో ఒక రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అధికారి సీహెచ్.రమేశ్ శుక్రవారం (అక్టోబర్ 11,2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలిపారు.
రైళ్ల నెంబర్లు.. సమయాలు:
ట్రైన్ నెంబర్ (07610) సికింద్రబాద్ నుంచి తిరుచిరాపల్లి వీక్లీ ప్రత్యేక రైలు సోమవారం (అక్టోబర్ 14,2019)న రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి తరువాతి రోజు రాత్రి 7.15 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అక్టోబర్ 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
ట్రైన్ నెంబర్ (07609) తిరుచిరాపల్లి నుంచి సికింద్రాబాద్ వీక్లీ ప్రత్యేక రైలు బుధవారం(అక్టోబర్ 16,2019)న సాయంత్రం 6.05గంటలకు తిరుచిరాపల్లిలో బయలుదేరి తరువాతి రోజు సాయంత్రం 4.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్టోబర్ 16, 23, 30, నవంబర్ 6, 13, 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1వ తేదీల్లో ఈ రైలు ప్రయాణికులకు సేవలు అందించనుంది.