చార్జిషీట్ దాఖలు : డ్రగ్స్ కేసులో సినీ స్టార్స్ కు క్లీన్ చిట్

పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 06:40 AM IST
చార్జిషీట్ దాఖలు : డ్రగ్స్ కేసులో సినీ స్టార్స్ కు క్లీన్ చిట్

పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ

డ్రగ్స్ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది సిట్. సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ విచారణ. సినీ ఇండస్ట్రీకి చెందిన వారితోపాటు 62 మందిని విచారించింది సిట్. వాళ్ల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా సాగింది ఈ విచారణ. రెండేళ్ల తర్వాత చార్జిషీట్లు దాఖలు చేసింది సిట్. ఈ కేసులో విచారణకు హాజరయిన సినీ, ఇతర ప్రముఖుల పేర్లు చార్జిషీటులో లేవు.

మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్.. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే చేర్చింది. 12 మంది అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ వేరు – ఊహాగానాలు వేరు అని చార్జిషీటు స్పష్టం చేస్తోంది.

62 మందిపై కేసు నమోదు చేసిన సిట్.. 12 మందిని నిందితులుగా చేర్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇవ్వటం విశేషం. డ్రగ్స్.. కేసు చిత్తు అయ్యింది. సిట్ అధికారులు దాఖలు చేసిన చార్జీషీట్లు నాలుగులో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పై ఉంది. మరొకటి ముంబై నుంచి హైదరాబాద్ కు కొకైన్ సరఫరా చేసి అమ్ముతున్నాడని 2017లో అరెస్ట్ చేసిన అలెక్స్ లపై ఉంది.