కోర్టుకెళ్లిన కాంగీ నేతలు : గెలిచిన అభ్యర్ధుల పై కేసు 

  • Published By: chvmurthy ,Published On : January 25, 2019 / 12:05 PM IST
కోర్టుకెళ్లిన కాంగీ నేతలు : గెలిచిన అభ్యర్ధుల పై కేసు 

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమపై గెలిచిన అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని కోరూతూ కాంగ్రెస్ పార్టీ  కి చెందిన 12 మంది  సీనియర్ నాయకులు శుక్రవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వారు కోర్టుకెళ్లినట్లు తెలుస్తోంది.  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలతో గెలిచారంటూ  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, తో పాటు  డికె అరుణ,పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లక్ష్మణ్ కుమార్,పద్మావతి, అద్దంకి దయాకర్, పవన్ కుమార్,ఫిరోజ్ ఖాన్,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పీటీషన్ దాఖలు చేశారు. ఈ పీటీషన్ పై సోమవారం హై కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.  
కాగా …. ఈ  పిటీషన్ పై  వెంటనే స్టే వచ్చే అవకాశం లేదని న్యాయవాదులు చెపుతున్నారు. ఎన్నికల కమీషన్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం  ఉందంటున్నారు.