సరిలేరు నీకెవ్వరు ఎఫెక్ట్: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీస్టేడియంలో ఇవాళ(05 జనవరి 2020) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు అడిషనల్ సీపీ అనిల్కుమార్ ట్రాఫిక్ ఆంక్షల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు.
ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి వచ్చేవాహనాలను నాంపల్లివైపుకు.. అబిడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను గన్ఫౌండ్రీ వైపుకు.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి బషీర్బాగ్ వైపు వెళ్లేవాహనాలను హిమాయత్నగర్ వైపు మళ్లించేదుకు నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.
అలాగే కింగ్కోఠి వైపు నుంచి వచ్చేవాహనాలను ఈడెన్గార్డెన్ వైపు పంపుతారు. లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను హిమాయత్నగర్ వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చేవాహనాలను నాంపల్లివైపు పంపుతారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.