సమయం లేదు.. ఇక సెలవు: విజయశాంతి
దశాబ్ధ కాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న లేడీ సూపర్స్టార్ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చిన సక్సెస్తో రాజకీయాలకు దూరమవదుతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక సినిమాలే చేస్తుందని ప్రజా జీవితానికి దూరమైనట్లే అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె లేటెస్ట్గా ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పని చేయడమే కాదు.. సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్కు చెల్లెలు అన్నట్లుగా ఉన్న ఆమె, కొన్నాళ్లకు ఆయనతో విభేదించి కాంగ్రెస్లో చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. అయితే, అప్పటి ప్రచారంలో కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత విజయశాంతి రాజకీయాల్లో సైలెంట్ ఉండిపోయారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహిరించిన విజయశాంతి మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో విజయశాంతి చేసిన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో విజయశాంతి పాత్ర కూడా ప్రత్యేకం.. అయితే విజయశాంతికి ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. వాటిని ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారట.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా.. సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు.
మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని బట్టి చూస్తే ఆమె మళ్లీ ఇంకో సినిమా చేసే ఆలోచనలో అయితే లేనట్లుగా తెలుస్తుంది. రాజకీయాల్లోనే చురుగ్గా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో సెకెండ్ ఇన్నింగ్స్ అదరగొట్టిన రాములమ్మ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటుంది అనేది అర్థం అవుతుంది.
#సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు
నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) February 2, 2020
ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు.
మనసు నిండిన మీ ఆదరణకు,
నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి
ఎప్పటికీ నమస్సులు?మీ విజయశాంతి
— VijayashanthiOfficial (@vijayashanthi_m) February 2, 2020