Updated On - 10:38 am, Sat, 13 February 21
Warangal Constable: సాయం చేయడానికి స్తోమత కాదు కావాల్సింది మనసుండాలి. మనిషి పెద్దరికం అనేది వయస్సుతో రాదు చేసే పనులను బట్టి వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ గా అపాయింట్ అయిన పేదింటి యువతి తొలి జీతాన్ని ఆసరా లేని వాళ్లకు ఇచ్చేసింది. తానేమీ స్థితిమంతుల బిడ్డనో.. దుబారా ఖర్చు చేసే వ్యక్తిత్వం ఉన్న మహిళనో కాదు.
తండ్రి లేని బిడ్డ. తల్లి బీడీ కార్మికురాలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అనూష.. పేదరికంలోనే ఎంఏ బీఈడీ వరకూ చదువుకుంది. ప్రైవేట్ టీజర్ గా పనిచేస్తూనే పోలీస్ కానిస్టేబుల్ అయింది. ప్రజలకు సర్వీసు అందించే వృత్తిలో ఉన్న ఆమె.. మొదటి జీతాన్ని కూడా పేదవారికే ఇచ్చేయాలని నిశ్చయించుకుంది.
అదే సంకల్పంతో మొదటి వేతనాన్ని ఆహారం సమకూర్చడానికి ఉపయోగించానని రానున్న రోజుల్లో శక్తి మేరకు మరింత సాయపడతానని అనూష చెబుతోంది. పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Ration Cards, Pensions : త్వరలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు
Young Man Suicide: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడు బలవన్మరణం
Employment Guarantee Scheme – ఉపాధి హామీలో ఏపీకి 3వ స్థానం.. కరోనా కష్టకాలంలోనూ పని ఇచ్చిన ప్రభుత్వం
యూట్యూబ్లో చూసి ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్
MLC Election Vote Counting : మందకొడిగా నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
నిమిషానికి రూ. వెయ్యి కోట్లు.. రూ.3.80 లక్షల కోట్లు నష్టం