చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామిని కలిశారు. శనివారం (మార్చి-2-2019) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్‌

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 04:33 PM IST
చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామిని కలిశారు. శనివారం (మార్చి-2-2019) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్‌

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామిని కలిశారు. శనివారం (మార్చి-2-2019) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌ స్వామి దివ్యసాకేత ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో కాసేపు గడిపిన జగన్.. చినజీయర్‌ స్వామితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన దివ్య ఆశీస్సులు తీసుకుని వెళ్లిపోయారు. జగన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగన్‌ వెంట విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

వైఎస్ జగన్ శనివారం ఉదయం ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. జాతీయ రాజకీయాలు, ఏపీ ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనలను పంచుకున్నారు. త్వరలో ఎన్నికలు రానున్న తరుణ చినజీయర్ స్వామిని జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ ఒకసారి చినజీయర్‌ స్వామిని జగన్ కలిశారు.