Home » వందే భారత్ : దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
Published
4 weeks agoon
తెలంగాణ భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.#గణతంత్రదినోత్సవం#RepublicDayIndia pic.twitter.com/y1zgfZo1Qu
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
తెలంగాణ హైకోర్టులో జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళలుర్పించారు.
ఇండియా గేట్ వద్ద అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద సైనికులకు మోడీ, రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. 55ఏళ్ల తర్వాత ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు త్రివర్ణ పతకాలతో అలంకరించారు. ఐదంచెల భద్రతా వలయంలో సెంట్రల్ ఢిల్లీ వరకు మోహరించారు.
విజయవాడ వేడుకల్లో ఏపీ గవర్నర్, సీఎం జగన్ పాల్గొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.
గణతంత్ర వేడుకల్లో సీఎం జగన్, మంత్రులు, సీఎస్, డీజేపీ పలువురు పాల్గొన్నారు. అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను స్పీకర్ తమ్మినేని ఆవిష్కరించారు.
శాసనమండలి వద్ద జాతీయ జెండాను చైర్మన్ షరీఫ్ ఆవిష్కరించారు. సచివాలయం వద్ద జాతీయజెండాను స్సెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఆవిష్కరించారు.
రాజ్ ఫథ్లో 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు.
Delhi: President Ram Nath Kovind arrives at Rajpath for the #RepublicDay parade and celebrations. pic.twitter.com/1Jt4TZpV03
— ANI (@ANI) January 26, 2021
త్రివద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు ఉపరాష్టప్రతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
పరేడ్ లో సైనిక కవాతులో 122 మంది బంగ్లాదేశ్ సైనికులు పాల్గొన్నారు. 38 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు విన్యాసాలను ప్రారంభించాయి.
Republic Day: A replica of the Sun Temple at Modhera displayed on the #Gujarat tableau
The tableau depicts the Sabhamandap, part of the Sun Temple. It’s 52 pillars denote 52 weeks of a Solar year. pic.twitter.com/ga2jBMz75G
— ANI (@ANI) January 26, 2021
రఫెల్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణతంత్ర పరేడ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలు కూడా ఉన్నాయి. ఏపీ, గుజరాత్, యూపీ, అసోం, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
One Rafale with 2 Jaguar Deep penetration strike aircraft & 2 MiG-29 Air Superiority Fighters, in ‘Eklavya’ formation are the next to fly past, at a height of 300m & speed of 780 Km/h.
The formation is led by Gp Capt Rohit Kataria, Flight Commander of 17 Squadron. #RepublicDay pic.twitter.com/UCCcQMy0gR
— ANI (@ANI) January 26, 2021