COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,619 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,00,691కి చేరిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 19,398 మందికి ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో కరోనాకు చికిత్స అందుతున్నట్లు తెలిపింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదు

india corona cases

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,619 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,00,691కి చేరిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

ప్రస్తుతం దేశంలో 19,398 మందికి ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో కరోనాకు చికిత్స అందుతున్నట్లు తెలిపింది. కరోనా రికవరీ రేటు 98.77 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 219.60 కోట్ల కరోనా డోసులు వినియోగించారని పేర్కొంది. వాటిలో 95.01 కోట్ల రెండో డోసులు, 22.06 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని తెలిపింది.

దేశంలో నిన్న 1,60,714 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 90.05 కోట్ల కరోనా పరీక్షలు చేశాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 1,42,704 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..