కొవిడ్-3వ దశ వ్యాక్సినేషన్ 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్‌లో..

కొవిడ్-3వ దశ వ్యాక్సినేషన్ 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్‌లో..

hospitals: కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం 60ఏళ్లు పైబడ్డ వారు, 45ఏళ్ల కంటే ఎక్కువ కమార్బిటీస్ ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనుంది. ఈ మేర 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్ ను రెడీ చేయనున్నారు.

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన్ (పీఎంజేఏవై) కింద ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే పనిచేయనున్నాయి. ఆరోగ్య శాఖ జరిపిన చర్చలతో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ అమ్మకాలు జరపడానికి వీల్లేదని తేల్చాయి. కాకపోతే వ్యాక్సినేషన్ జరిగినా.. ఎటువంటి నామినల్ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు.

10వేల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వనున్నారు. కేంద్ర క్యాబినెట్ బుధవారం చర్చలు జరిపిన తర్వాత.. మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. తర్వాతి దశ వ్యాక్సినేషన్ మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడ్డవారికి వేయనున్నట్లు, 45ఏళ్లు కంటే ఎక్కువ వయస్సుండి సమస్యలు ఉన్న వారికి వేస్తాం.

దాదాపు 10వేల ప్రభుత్వ హాస్పిటల్స్ లో.. 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించారు.