Next Chief Justice of India: ‘తదుపరి సీజేఐ ఎవరు?’ సిఫార్సు చేయాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ను కోరిన కేంద్రం
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రతిపాదనలు పంపాలని చీఫ్ జస్టిస్ లలిత్కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది.
Next Chief Justice of India: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రతిపాదనలు పంపాలని చీఫ్ జస్టిస్ లలిత్కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. 50వ సీజేఐగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని కోరింది. ఆనవాయితీ ప్రకారం అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సీజేఐ సిఫార్సు చేస్తారు. ప్రస్తుతం సీజేఐ జస్టిస్ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వారిని తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..