Next Chief Justice of India: ‘తదుపరి సీజేఐ ఎవరు?’ సిఫార్సు చేయాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ను కోరిన కేంద్రం

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్​ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రతిపాదనలు పంపాలని చీఫ్ జస్టిస్​​ లలిత్​కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది.

Next Chief Justice of India: ‘తదుపరి సీజేఐ ఎవరు?’ సిఫార్సు చేయాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ను కోరిన కేంద్రం

Next Chief Justice of India

Next Chief Justice of India: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్​ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రతిపాదనలు పంపాలని చీఫ్ జస్టిస్​​ లలిత్​కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. 50వ సీజేఐగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని కోరింది. ఆనవాయితీ ప్రకారం అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సీజేఐ సిఫార్సు చేస్తారు. ప్రస్తుతం సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వారిని తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్​ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..