COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,994 మందికి కరోనా.. 23,432 యాక్టివ్ కేసులు

దేశంలో కొత్తగా 1,994 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 23,432గా ఉన్నట్లు తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,601 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,40,90,349గా ఉన్నట్లు వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,994 మందికి కరోనా.. 23,432 యాక్టివ్ కేసులు

india corona cases

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,994 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 23,432గా ఉన్నట్లు తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,601 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,40,90,349గా ఉన్నట్లు వివరించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.99 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 219.55 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. వాటిలో 95 కోట్ల రెండో డోసులు, 22.02 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నట్లు చెప్పింది.

నిన్న దేశంలో 2,10,617 డోసులు వినియోగించినట్లు పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 90.0 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,61,290 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..