రైలు టిక్కెట్లపై ఛార్జీల బాదుడు.. ప్రయాణాలు తగ్గించడం కోసమే: రైల్వే మినిస్ట్రీ

రైలు టిక్కెట్లపై ఛార్జీల బాదుడు.. ప్రయాణాలు తగ్గించడం కోసమే: రైల్వే మినిస్ట్రీ

Local Trains: మినిష్ట్రీ ఆఫ్ రైల్వేస్ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. తక్కువ దూరాలకే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంది.. ఇదంతా అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం కోసమేనని వెల్లడించింది. లాక్‌డౌన్ తర్వాత ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. 2020 మార్చి 25నుంచి రెగ్యూలర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. లాక్ డౌన్ రిలీజ్ చేసిన తర్వాత స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు ఏర్పాటయ్యాయి.

ఛార్జీలు ఎక్కువ చేయడంతో
కొవిడ్-19 గురించి ప్రత్యేక నియమాలు మొదలుపెట్టి.. అదే దూరానికి మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను పెంచామని రైల్వే మినిస్ట్రీ చెప్పింది. రైల్వేస్ ప్రస్తుతం లోకల్ ట్రైన్ సర్వీసులు కూడా మొదలుపెట్టింది. రోజూ వెళ్లే వాళ్ల కోసమే మొదలుపెట్టినా ఛార్జీలు ఎక్కువ చేయడంతో విమర్శలు తప్పడం లేదు. ఉదహరణకు అమృత్ సర్ నుంచి పఠాన్ కోట్ కు రూ.25గా ఉండే ఛార్జీ రూ.55కు పెరిగింది.

31 railway stations

south central railway

తక్కువ దూరాలకు తగ్గించుకోవాలనే
అత్యవసరం కాని ప్రయాణాలు, తక్కువ దూరాలకు వెళ్లడం వంటివి తగ్గించుకోవాలనే రైల్వేస్ ఛార్జీలను పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ 19ఇంకా తీవ్రంగానే ఉంది. ప్రయాణికులు చాలా ప్రదేశాల నుంచి వస్తున్నారు. రైళ్లలో గుంపులుగా ఉండటాన్ని తగ్గించడం కోసం, కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఇలా చేసినట్లు మినిష్ట్రీ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించింది.

తక్కువ దూరాలకు ప్రయాణించే రైళ్లు 3శాతమే
ప్రస్తుతం రైల్వేస్ 65 శాతం మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపరేషన్ లోకి తీసుకొచ్చింది. మొత్తం 1250 మెయిల్/ఎక్స్ ప్రెస్, 5350సబ్ అర్బన్ సర్వీసులు 326కు పైగా ప్యాసింజర్ ట్రైన్లు ఆపరేషన్లో ఉన్నాయి. మొత్తం ఆపరేషన్ లో ఉన్న ట్రైన్లలో తక్కువ దూరాలకు ప్రయాణించే రైళ్లు 3శాతమే ఉన్నాయి.

ప్రయాణికుడి ప్రతి నష్టాన్ని ప్రభుత్వమే
కొవిడ్-19 కారణంగా రెగ్యూలర్ ట్రైన్లను జాతీయవ్యాప్తంగా ఆపేశారు. 2020 మార్చి 22తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. లాక్ డౌన్ తర్వాత నిదానంగా సర్వీసులు పెంచింది. ఇంకా పూర్తి స్థాయిలో రెగ్యూలేషన్ చేయాల్సి ఉంది. రైల్వేస్ ప్రయాణికుడి మీద జరిగే ప్రతి నష్టాన్ని రైల్వేస్ భరిస్తుంది.