వరుస వికెట్ల కోల్పోయి నిలదొక్కుకున్న ఇంగ్లాండ్
Ind vs Eng: సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృభించడంతో స్వల్ప విరామంతో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. 23.5వ బంతికి రారీ బర్న్స్ 63పరుగుల వద్ద తొలి వికెట్ గా, రెండో వికెట్గా డానియేల్ లారెన్స్ ను కోల్పోయింది. శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగింది.
టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, నదీమ్
టీం ఇంగ్లాండ్:
జో రూట్(కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్
కెప్టెన్ జో రూట్ 100వ టెస్ట్:
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అదేకాకుండా కొంతకాలంగా టెస్టుల్లో సూపర్ ఫామ్లో ఉన్న జో రూట్.. ఈ సిరీస్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.