IPL 2022: సచిన్ కాళ్లు పట్టుకున్న జాంటీ రోడ్స్

మరోసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12పరుగుల తేడాతో ఇంకో వైఫల్యాన్ని మూటగట్టుకుంది.

IPL 2022: సచిన్ కాళ్లు పట్టుకున్న జాంటీ రోడ్స్

Sachin Tendulkar

IPL 2022: మరోసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12పరుగుల తేడాతో ఇంకో వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ మిడిలార్డర్‌లో సూర్యకుమార్, కీరన్ పొలార్డ్ ను తొలగించడంతో పంజాబ్ కింగ్స్ కు మరింత సులువైంది.

మ్యాచ్ తర్వాత ఇద్దరు లెజెండ్స్ అదే మైదానంలో కలుసుకున్నారు. జాంటీ రోడ్స్, సచిన్ టెండూల్కర్ ను కలిసి చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం అభినందనలతో నిండిపోయింది.

మ్యాచ్ తర్వాత ఇరు జట్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ.. అభివాదాలు తెలుపుకుంటున్నారు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ మెంటార్ గా నటిస్తున్న సచిన్ టెండూల్కర్ కాళ్లు పట్టుకోబోతుంటే సచిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బలవంతంగా కాళ్లు పట్టుకున్న జాంటీ రోడ్స్ ను పైకి లేపి హగ్ చేసుకున్నాడు సచిన్.

IPL 2022: సచిన్, యువరాజ్‌లతో సమానంగా ఇషాన్ కిషన్

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తలరాత మారలేదు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై జట్టు పరాజయాలు వెంటాడుతున్నాయి. వరుసగా 5వ మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో ముంబై పరాజయం పాలైంది.

199 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రోహిత్ సేన.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.

ఈ టోర్నీలో ఈసారి ముంబై ఇండియన్స్ ఆటతీరు చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మరోవైపు, పంజాబ్ ఖాతాలో మూడో విజయం చేరింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో 5 మ్యాచుల్లో మూడు గెలవగా, వాటిల్లో ఓడింది.

Jonty Rodes 1

Jonty Rodes 1