నరబలికి ఒడిగట్టిన మరో తల్లి.. ఆరేళ్ల కొడుకుని హత్య చేసి పోలీసుల చెరలో..

నరబలికి ఒడిగట్టిన మరో తల్లి.. ఆరేళ్ల కొడుకుని హత్య చేసి పోలీసుల చెరలో..

Human Sacrifice: కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకును హత్య చేసింది. ఆ ఘటన తర్వాత తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి అరెస్టు అయిపోయింది. నాలుగోసారి ప్రెగ్నెంట్ అయిన షహీదా.. ఆదివారం రాత్రి భర్త ఇద్దరు పిల్లలు వేరే గదిలో నిద్రపోతుండగా ఆరేళ్ల కొడుకును ఇటువైపు గదిలో చంపేసింది.

ఆ తర్వాత పోలీసులకు మెసేజ్ ఇచ్చింది. ఘటనాస్థలానికి వచ్చిన వారు ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

గత నెల ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే నమోదైంది. ఇద్దరు కూతుళ్లను మూడనమ్మకాల పేరిట హత్య చేసిందో తల్లి. విద్యావంతులైన పేరెంట్స్.. కూతురిలో ఏదో చెడు ఆత్మ ప్రవేశించిందని దానిని పోగొడతామంటూ ప్రయత్నాలు చేశారు. కొద్ది రోజులుగా ఆ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించేవని స్థానికులు చెబుతున్నారు.