Crime News: ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేసి భార్యను చంపాలనుకున్న శాడిస్టు భర్త.. చివరకు..

భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేశాడు ఓ శాడిస్టు భర్త. తాను చేసిన ఈ కుట్రలో తన భార్య చనిపోతే విద్యుదాఘాతంతో మృతి చెందిందని అందరినీ నమ్మించాలని అనుకున్నాడు. అయితే, ఆ తలుపును అతడి అత్త ముట్టుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బైతూల్ జిల్లాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సైఖేడా గ్రామంలో చోటుచేసుకుంది.

Crime News: ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేసి భార్యను చంపాలనుకున్న శాడిస్టు భర్త.. చివరకు..

Crime News

Crime News: భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేశాడు ఓ శాడిస్టు భర్త. తాను చేసిన ఈ కుట్రలో తన భార్య చనిపోతే విద్యుదాఘాతంతో మృతి చెందిందని అందరినీ నమ్మించాలని అనుకున్నాడు. అయితే, ఆ తలుపును అతడి అత్త ముట్టుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బైతూల్ జిల్లాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సైఖేడా గ్రామంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ ఉదయం పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు ప్రతిరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడని కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి అప్పాల సింగ్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారని చెప్పారు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు.

ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోతున్న భర్త తన అత్త ఇంటికి వెళ్లి అక్కడి తలుపుపై విద్యుత్ వైరు వేశాడని చెప్పారు. భార్యను చంపాలని ఆ వైరు వేశాడని, అయితే, ఆ తలుపును అతడి అత్త ముట్టుకోవడంతో ఆమె చనిపోయిందని వివరించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..