Viral Video: ‘కారును మెల్లగా నడుపు’ అంటూ పంత్‌కు మూడేళ్ల క్రితం ధావన్ చేసిన సూచన ఇప్పుడు వైరల్

కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

Viral Video: ‘కారును మెల్లగా నడుపు’ అంటూ పంత్‌కు మూడేళ్ల క్రితం ధావన్ చేసిన సూచన ఇప్పుడు వైరల్

Viral Video

Viral Video: ‘కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో గతంలో శిఖర్ ధావన్, రిషబ్ పంత్ ఓ ప్రోగ్రాంలో మాట్లాడుకున్న మాటలను నెటిజన్లు తెగ గుర్తు చేసుకుంటున్నారు.

ఓ ప్రోగ్రాంలో శిఖర్ ధావన్ ను రిషబ్ పంత్ ఓ విషయం అడుగుతాడు. తనకు ఏదైనా సూచన చేయాలనుకుంటే చేయవల్సిందిగా కోరతాడు. దీంతో శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘బండిని మెల్లిగా నడిపించు’’ అని చెబుతాడు. ఆ ప్రోగ్రాంలో ప్రశ్న, జవాబుల రౌండ్ లో శిఖర్ ధావన్, పంత్ ఇద్దరూ చాలా సరదాగా గడుపుతాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ టీమిండియా అభిమానులు రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ జరిగిన తీరును గుర్తు చేస్తున్నారు.

ధావన్ చేసిన సూచనను పాటిస్తూ పంత్ కారును మెల్లిగా నడిపి ఉంటే ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురయ్యేవాడు కాదని అంటున్నారు. కారును మెల్లిగా నడిపితే డివైడర్ ను ఢీ కొన్నప్పటికీ గాయాలు తగలకపోయేవని కొందరు కామెంట్లు చేశారు. కాగా, రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

Hyderabad Pubs : న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్ పబ్‌లకు హైకోర్టు షాక్‌