మళ్లీ ఏమైంది: రోహిత్, రహానెలతో పాటు మరో ముగ్గురికి హోం క్వారంటైన్..?

మళ్లీ ఏమైంది: రోహిత్, రహానెలతో పాటు మరో ముగ్గురికి హోం క్వారంటైన్..?

Rohit Rahane: టీమిండియా క్రికెట్ టీం గురువారం ఉదయానికి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనకుముందు హోం క్వారంటైన్ లో ఉన్న రోహిత్ శర్మకు మళ్లీ క్వారంటైన్ తప్పలేదు. ఇండియాకు వచ్చిన తర్వాత మరోసారి ఏడు రోజుల క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. అతనితో పాటు మరో నలుగురికి క్వారంటైన్ తప్పడం లేదు.

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లోకి దిగగానే క్రికెట్ టీం సభ్యులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించారు. బృహన్ముంబై మునిసిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. కొందరు ప్లేయర్లు మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండక తప్పదు’ అని చెప్పారు.

వీరిలో అజింకా రహెన్, రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షాలు ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా అదే రోజు ఉదయం ముంబైలో దిగారు. గాయాలతో సతమతమైనప్పటికీ టీమిండియా ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో చివరి టెస్టు ఓడించి.. బ్రిస్బేన్ సాక్షిగా సిరీస్ ను కైవసం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో సొంతం చేసుకుంది.

ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు ప్లేయర్లను అభినందించగా.. కెప్టెన్ రహానెతో కేక్ కట్ చేయించారు.