india vs west indies: చాలా స‌మ‌ర్థంగా ఆడి ల‌క్ష్యాన్ని ఛేదించాం: రోహిత్ శ‌ర్మ

వెస్టిండీస్‌తో నిన్న జ‌రిగిన మూడ‌వ‌ టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘనవిజయం సాధించ‌డంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. వెస్టిండీస్ ఇచ్చిన‌ 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. చాలా స‌మ‌ర్థంగా ఆడి ల‌క్ష్యాన్ని ఛేదించామ‌ని చెప్పాడు. మైదానంలోని ప‌రిస్థితుల‌ను త‌మ జ‌ట్టు ఉప‌యోగించుకున్న తీరు చాలా బాగుంద‌ని అన్నాడు. ఈ మ్యాచులో త‌న‌కైన గాయం గురించి స్పందిస్తూ.. ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తెలిపాడు.

india vs west indies: చాలా స‌మ‌ర్థంగా ఆడి ల‌క్ష్యాన్ని ఛేదించాం: రోహిత్ శ‌ర్మ

Rohit Sharma (1)

india vs west indies: వెస్టిండీస్‌తో నిన్న జ‌రిగిన మూడ‌వ‌ టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘనవిజయం సాధించ‌డంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. వెస్టిండీస్ ఇచ్చిన‌ 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. చాలా స‌మ‌ర్థంగా ఆడి ల‌క్ష్యాన్ని ఛేదించామ‌ని చెప్పాడు. మైదానంలోని ప‌రిస్థితుల‌ను త‌మ జ‌ట్టు ఉప‌యోగించుకున్న తీరు చాలా బాగుంద‌ని అన్నాడు. ఈ మ్యాచులో త‌న‌కైన గాయం గురించి స్పందిస్తూ.. ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తెలిపాడు. త‌దుప‌రి మ్యాచ్‌కు కొన్ని రోజుల‌ స‌మ‌యం ఉంద‌ని తెలిపాడు.

ఆలోగా త‌న గాయం మానుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. నిన్న‌టి మ్యాచులో తాము మిడిల్ ఓవ‌ర్లు వేసిన తీరు చాలా ముఖ్య‌మైంద‌ని తెలిపాడు. అన్ని ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థంగా వాడుకున్నామ‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు. ఈ ఆట‌లో అంత‌గా రిస్క్ తీసుకోలేద‌ని తెలిపాడు. సూర్య (76 ప‌రుగులు) అద్భుతంగా ఆడాడ‌ని చెప్పాడు. శ్రేయాస్ అయ్య‌ర్ (24) చ‌క్క‌ని భాగ‌స్వామ్యం అందించాడ‌ని తెలిపాడు. ఈ పిచ్‌లో వెస్టిండీస్ ఇచ్చిన‌ 165 ప‌రుగుల ల‌క్ష్యం అంత తేలిక‌గా ఛేదించే టార్గెట్ కాద‌ని అన్నాడు. కాగా, ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో లీడ్‌లో ఉంది.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు