Viral Video: వేదికపై ఈశ్వరానందపురీ స్వామీజీ మాట్లాడుతుండగా మైకు లాక్కున్న సీఎం బొమ్మై

కాగినేలే మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానందపురీ స్వామీజీ వేదికపై మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి మైకును లాగేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. నిన్న ఈశ్వరానందపురీ స్వామీజీతో కలిసి ఓ కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రభుత్వం, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారుల తీరుపై విమర్శలు చేశారు.

Viral Video: వేదికపై ఈశ్వరానందపురీ స్వామీజీ మాట్లాడుతుండగా మైకు లాక్కున్న సీఎం బొమ్మై

Viral Video

Viral Video: కాగినేలే మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానందపురీ స్వామీజీ వేదికపై మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి మైకును లాగేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. నిన్న ఈశ్వరానందపురీ స్వామీజీతో కలిసి ఓ కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రభుత్వం, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారుల తీరుపై విమర్శలు చేశారు.

‘‘బెంగళూరులో భారీ వర్షాలు వచ్చిన సమయంలోనే ప్రజాప్రతినిధులు, బీబీఎంపీ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. చాలాసార్లు ఈ తీరు చూశాం. అయితే, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోలేదు. అసలు సమస్య ఏంటన్న విషయాన్ని అధికారులు గ్రహించలేదా? పరిష్కార మార్గాన్ని కనుగొనలేరా? దీనికి శాశ్వత పరిష్కారం చూపుతానని సీఎం అన్నారు. కేవలం హామీ ఇవ్వడాన్ని మేము అంగీకరించబోము’’ అని ఈశ్వరానందపురీ స్వామీజీ చెప్పారు.

అనంతరం స్వామీజీ ఏదో మాట్లాడుతుండగా ఆయన చేతిలో నుంచి సీఎం బొమ్మై చిరాకుగా మైకును తీసుకున్నారు. ‘‘హామీ ఇవ్వడమే కాదు. మేము ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాము. నిధులు కేటాయించాం. పనులు కూడా ప్రారంభమయ్యాయి. నేను గత సీఎంలలా కేవలం హామీలు ఇచ్చి వదిలేయను. చెప్పింది చేస్తాము.. నేను ఎవ్వరికీ భయపడను’’ అని బొమ్మై అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Bharat Jodo Yatra: కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా