వాట్సప్‌కు ఇండియాలో లీగల్ నోటీసులు

వాట్సప్‌కు ఇండియాలో లీగల్ నోటీసులు

Whatsapp: వాట్సప్ అప్‌డేట్ చేసిన ప్రైవసీ పాలసీపై ఇండియాలో లీగల్ నోటీసులు తప్పేట్లు కనిపించడం లేదు. ఇండియా సెక్యూరిటీ ఈ మేర ప్రొసీడ్ అవనున్నట్లు గురువారం వెల్లడించింది. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన సంస్థ లీగల్ ఛాలెంజ్ ఎదుర్కోనుంది.

కాలిఫోర్నియాకు చెందిన వాట్సప్.. జనవరి 4న యూజర్ల లొకేషన్, ఫోన్ నెంబర్ వంటివి ఫేస్ బుక్ తో షేర్ చేసుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాదు ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ కూడా. ఇండియాలో ఉన్న 400మిలియన్ యూజర్లను టార్గెట్ చేస్తూ బిగ్గెస్ట్ మార్కెట్ గా ఎదగాలనుకుని ఇలా చేసింది.

ఈ మార్పు అనేది టర్కీలోనూ ఓ ఛాలెంజింగ్ గా మారింది. ఈ వారమే మెసేజింగ్ సర్వీసు మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇండియాలోనూ చాలా మంది యూజర్లు వాట్సప్ కు ఆల్టర్నేటివ్ గా సిగ్నల్, టెలిగ్రాములను ఇన్‌స్టాల్ చేసేసుకుంటున్నారు. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం.. ఓ యూజర్ ఆన్ లైన్ యాక్టివిటీని 360డిగ్రీలు ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని లాయర్ చైతన్య రోహిళ్ల అంటున్నారు.