Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి

గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.

Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి

Pakistan avalanche

Avalanche 10 Died : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్-బాల్టిస్థాన్ రీజియన్ లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం విరుచుకుపడింది. దీంతో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందారు. మరో 25మంది గాయపడ్డారు. పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. గాయపడిన వారిలో 13 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు, వారిలో 12మంది పరిస్థితి విషమంగా ఉందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి

ఈ దుర్ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాక్ ను రక్షించాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు గిల్గిత్-బాల్టిస్థాన్ సీఎం ఖలీద్ ఖుర్షీద్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలను ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారు.