ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ వ్యాఖ్యలకు కౌంటర్ : టోక్యో ఒలింపిక్స్‌ బోర్డులో ఒకేరోజు 12మంది మహిళలు అపాయింట్ మెంట్..

ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ వ్యాఖ్యలకు కౌంటర్ : టోక్యో ఒలింపిక్స్‌ బోర్డులో ఒకేరోజు 12మంది మహిళలు అపాయింట్ మెంట్..

12 women added to Tokyo Olympics executive board : ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లని తీసుకుంటే ఎక్కువ మాట్లాడతారు..దాని వల్ల టైమ్ వేస్టు అవుతుంది‘ అని కామెంట్‌ చేసి..టోక్యో ఒలింపిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి ఓ మహిళే వచ్చారు. ఆమే పేరు సీకో హషిమొటొ. టోక్యో ఒలింపిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో గత కొన్ని రోజుల క్రితం ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్‌ అయ్యారు.

ఈ సందర్భంగా హషిమొటొ మాట్లాడుతూ..‘మహిళలు ఎక్కువ మాట్లాడతారు‘ అని యషిరొ మొరి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. జెండర్‌ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు చేపడతామని ఆమె స్పష్టంచేశారు. మహిళలపై గత ప్రెసిడెంట్ యషిరొ మొరి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్‌ లోకి తీసుకున్నా ప్రెసిడెంట్ హషిమొటొ. అంతేకాదు జెండర్‌ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయని తెలిపారు.

కాగా..టోక్యో ఒలింపిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ఒక్కరోజున 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్‌ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది అయ్యారు. దీంతో బోర్డులో మహిళల 42 శాతానికి పెరిగింది.అంటే మొత్తం సభ్యులు 45 మంది. ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్‌ సీకో హషిమొటొ కావటం గమనించాల్సిన విషయం.

టోక్యో ఒలింపిక్స్‌ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్..ఆ తరువాత ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్ జరుగనున్నాయి‌. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ’ పకడ్బందీగా పక్కా ప్లాన్స్ రెడీ చేస్తోంది. కమిటీ ప్రెసిడెంట్‌ గా సీకో హషిమొటొ నియమితులయ్యారు. హషిమొటొ కూడా ఒకప్పుడు క్రీడాకారిణే కావటం మరో విశేషమని చెప్పాలి. హషిమొటొ ఒలింపిక్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులే ఉన్నత స్థానాల్లోకి వెళితే తోటి క్రీడాకారులకు న్యాయం జరుగే అవకాశాలుంటాయి. ఇప్పుడిక ఒలింపిక్స్‌ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు హషిమొటొ. కమిటీ ప్రెసిడెంట్‌ పదవి అకస్మాత్తుగా ఖాళీ కావటంతో గత వారమే హషిమొటొ ప్రెసిడెంట్ స్థానంలోకి వచ్చారు.

ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాటలు తోటి మహిళల్లో స్ఫూర్తి నింపాయి. మహిళలు దేంట్లోను తక్కువ కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కొంతమంది ఉన్నతస్థానాల్లో ఉండి కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడటం సరైంది కాదని..మహిళలు సాధించిన విజయాలను వాళ్లు తెలుసుకోవాలని పరోక్షంగా గత ప్రెసిడెంట్ యషిరొ మొరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సమాధానమిచ్చారు.

మహిళలను తక్కువగా అంచనా వేయకూడదు..ప్రతిభ అనేది జెండర్ ను బట్టి ఉండదు. సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో మహిళలు ఏమాత్రం వెనుకాడని అందుకే..ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని తెలిపారు. ఆమె చెప్పినట్లుగానే..బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు 19 మందయ్యారు. ఈ 12మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్‌ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం అని చెప్పుకోవాలి..

కాగా…కొత్త నియమితులైన సీకో హషిమొటోకు ముందు ప్రెసిడెంట్‌ గా యషిరో మొరి ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించాల్సి ఉంది. ఈ నిర్వహాణలో భాగంగా పదే పదే సమావేశాలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. అలాగే సమావేశాల్లో చర్చించిన వివరాలను మీడియాకు ఎప్పటికప్పుడు అందించాల్సి ఉంటుంది. అలా యషిరో మొరి మీడియాతో మాట్లాడుతూ..మహిళల గురించి యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు చాలా ఎక్కువగా మాట్లాడతారు. దాని వల్ల టైమ్ వేస్టు అవుతుంది. అని మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదంగా మారియి.

మహిళలకు కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై జపాన్‌లోని మహిళా కమిషన్‌లు, సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాని తరువాత ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఫలితంగా యషిరో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలోకే మహిళా ప్రెసిడెంట్ గా సీకో హషిమొటొ నియమితులై బాధ్యతలు తీసుకున్నారు. ఈ అధికార మార్పు అంతా కేవలం వారం పది రోజుల్లోనే జరిగిపోయింది. దీంతో మహిళలను అపాయింట్ చేసుకోవటంతో హిషిమొటో దూకుడుగా ముందుకుపోతున్నారు.

ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘ఫాస్టుగా వర్క్ చేసి, మంచి ఫలితాలను సాధిస్తే మహిళలంటే ఏంటో రుజువు చేయాలని తోటి బోర్డు సభ్యులకు ఆమె తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు.

కాగా..‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌’ ర్యాంకుల ప్రకారంగా స్త్రీ పురుష సమానత్వంలో జపాన్‌ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్‌ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్‌ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తీసుకురానున్నట్లుగా హషిమొటొ స్పష్టంచేశారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్‌–ప్రెసిడెంట్‌లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్‌–ప్రెసిడెంట్‌ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి.