Russia Forces Killed : యుద్ధంలో 17,800 రష్యా సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17,800 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ శనివారం ప్రకటించింది.(Russia Forces Killed)

Russia Forces Killed : యుద్ధంలో 17,800 రష్యా సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

Russia Forces Killed

Russia Forces Killed : రష్యా-యుక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోంది. 38వ రోజు కూడా యుక్రెయిన్ లో ఇంకా కొన్ని చోట్ల రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి.

నెల రోజులకు పైగా రష్యా సేనలు యుక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.(Russia Forces Killed)

తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17,800 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ శనివారం ప్రకటించింది. దీంతోపాటు 631 యుద్ధ ట్యాంకులు, 1776 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 143 యుద్ధవిమానాలు, 134 హెలికాప్టర్లు, 87 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

నెల రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.(Russia Forces Killedసైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17,800 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ శనివారం ప్రకటించింది. దీంతోపాటు 631 యుద్ధ )

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన రష్యా.. మరిన్ని ప్రాంతాల్లో భీకర దాడులతో తెగబడుతూనే ఉంది. ఈ క్రమంలో యుక్రెయిన్‌పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్‌ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.(Russia Forces Killed)

యుక్రెయిన్‌ పోర్ట్‌ సిటీ మరియుపోల్‌లో రష్యన్‌ దాడుల కారణంగా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని స్థానిక పాలనా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. ‘ఆక్రమణదారు చేసిన ప్రతి నేరం, ప్రతి హత్య, విధ్వంసాన్ని రికార్డ్ చేయాలి. న్యాయం కోసం వాటిని అంతర్జాతీయ న్యాయస్థానానికి పంపాలి’ అని మేయర్‌ వాదిమ్‌ బోయ్‌చెంకో అన్నారు.

ఉత్తర ఉక్రెయిన్‌ నుంచి వెనక్కి వెళ్లిపోతున్న క్రమంలో రష్యన్‌ సేనలు.. ఎక్కడపడితే అక్కడ ల్యాండ్‌మైన్లు అమర్చుతున్నారని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఓ వీడియో లో సూచించారు. ‘వారు మొత్తం భూభాగంలో ల్యాండ్‌మైన్‌లు అమర్చుతున్నారు. ఇళ్లకు.. పరికరాలకు.. ఆఖరుకు మృతదేహాల మాటున కూడా’ అని జెలెన్ స్కీ హెచ్చరించారు. ‘ల్యాండ్‌మైన్‌లను తొలగించాం.. దాడుల భయం లేదు’ అని తాము ప్రకటించే వరకు స్థానికులు తమ సాధారణ జీవితాలను పునఃప్రారంభించడానికి వేచి ఉండాలని కోరారు.(Russia Forces Killed)

Russia-Ukraine War:నేలపై వైరం..ఆకాశంలో స్నేహం..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరిన రష్యా,అమెరికా వ్యోమగాములు..!!

చర్చల్లో భాగంగా యుక్రెయిన్ లోని కొన్ని నగరాల్లో బలగాలను మాత్రమే తగ్గిస్తామని చెప్పిన రష్యా.. ఆ మాటనూ నిలబెట్టుకుంటోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి రష్యా దళాలు వెనక్కు మళ్లించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధం ముగిసిందని ఉక్రెయిన్‌ బలగాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ తరుణంలో.. ఉక్రెయిన్‌ సైన్యాధికారి ఒకరు.. కీలక వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం ముగిసిపోలేదని, భవిష్యత్తుల్లో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చని భద్రతాధికారి ఒలెక్సీ డానీలోవ్‌ అంటున్నారు. యుద్ధం ముగిసిందని వేడుకలు చేసుకోవడానికి ఇది తరుణం కాదు. అది తొందరపాటు చర్యే అవుతుంది. యుద్ధం భయం ఇంకా పోలేదు. అలాగే భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చు అని అన్నారు. యుక్రెయిన్‌ను నాశనం చేయాలనే పుతిన్‌ ఆకాంక్ష ఇంకా పూర్తి కాలేదని, ఈ గ్యాప్‌లో సైన్యాన్ని పునఃసమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి, ఎవరూ తొందరపడి సంబురాలు చేసుకోవద్దని అన్నారు.(Russia Forces Killed)

తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే రష్యన్లు వెనక్కుమళ్లారని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. వాళ్లకు విజయం కావాలి. మే 9వ తేదీ (నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆ రోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటుంది) వాళ్లకు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. కాబట్టి మనం ముందు ముందు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు అని జాతిని, సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు జెలెన్‌స్కీ. అంతేకాదు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని వెలుపల భారీ విధ్వంసాన్ని సృష్టించాయన్నారు​. ఇదిలా ఉంటే.. కీవ్‌ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్టోమెల్‌లోని ఆంటోనోవ్ ఎయిర్ పోర్టు నుంచి మాస్కో దళాలు వెనక్కిమళ్లాయని భద్రతాధికారి ఒలెక్సీ డానిలోవ్ ప్రకటించారు.