నౌకలోంచి 80 మందిని సముద్రంలోకి విసిరేసిన స్మగ్లర్లు..!

నౌకలోంచి 80 మందిని సముద్రంలోకి విసిరేసిన స్మగ్లర్లు..!

smugglers throw 80 overboard  : ఆఫ్రికాలో స్మగ్లర్ల అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. పొట్ట చేత పట్టుకుని ఓ నౌకలో వలస వెళుతున్నా వలస కార్మికులపై స్మగ్లర్లు ప్రతాం చూపించారు. పడవలో ఎక్కువమంది ఉన్నారనీ..అలా ప్రయాణిస్తే పడవ మునిగిపోతుందని దాంతో పాటు తాము కూడా చనిపోతామని భయపడ్డారు. దీంతో ఆ నౌకలో ఉన్న వలస కార్మికుల్లో 80మందిని సముద్రంలోకి తోసేసారు.

అలా తోసేసిన 80మందిలో 20 మంది మృతి చెందిన దారుణ ఘటన తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి ప్రాంతంలో చోటుచేసుకుంది. మిగిలిన 60మంది ప్రాణాలు చేతిలో పెట్టుకుని సముద్రాన్ని ఈదుతో ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) గురువారం వెల్లడించింది.

ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని వేరే దేశానికి నౌకలో వలసవెళ్తున్న వారిలో 80 మందిని సముద్రంలోకి తోసేశారు స్మగ్లర్లు. వీరిలో 20 మంది మరణించారు. తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి నుంచి యెమెన్‌కు దాదాపు 200 మంది ఓ నౌకలో బుధవారం తెల్లవారుజామున బయలుదేరారు. వీరిలో దొంగతనంగా సరుకు రవాణా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నారు. అయితే నౌక సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అందులో ఉండటంతో స్మగ్లర్లు.. బలవంతంగా 80 మంది వలసదారులను సముద్రంలోకి తోసేశారు.

వీరిలో 20మంది ప్రాణాలు కోల్పోగా..మిగిలిన 60మంది సముద్రాన్ని ఊదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయినవారిలో ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రాణాలతో బైటపడినవారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.