Euro 2020 Football : కొంపముంచిన అభిమానం.. 2వేల మంది ఫ్యాన్స్‌కు కరోనా

ఆట మీద అభిమానం కొంపముంచింది. 2వేల మంది అభిమానులు కరోనా బారిన పడ్డారు.

Euro 2020 Football : కొంపముంచిన అభిమానం.. 2వేల మంది ఫ్యాన్స్‌కు కరోనా

Euro 2020 Football

Euro 2020 Football : : ఆట మీద అభిమానం కొంపముంచింది. 2వేల మంది అభిమానులు కరోనా బారిన పడ్డారు. యూరోకప్ లో భాగంగా ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లిన ఫుట్ బాల్ అభిమానులకు కరోనావైరస్ మహమ్మారి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ కు వచ్చిన 2వేల మందికి కోవిడ్ సోకినట్లు స్కాట్లాండ్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది. మ్యాచ్ కోసం భారీగా స్టేడియం దగ్గర జనం గుమిగూడటంతో పాటు బార్లు, పబ్ ల దగ్గర జనం గుంపులుగా తిరిగారు. కాగా ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించొద్దని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

జూన్ 18న ఇంగ్లండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది అభిమానులు స్కాట్లాండ్ నుంచి లండన్ కు వెళ్లారు. ఆ తర్వాత వారిలో 2వేల మంది కోవిడ్ బారిన పడ్డారు.

కొవిడ్ ఆంక్షల కారణంగా వెంబ్లేకి కేవలం 2వేల 600 టికెట్లు మాత్రమే స్కాట్లాండ్ కేటాయించింది. అయితే వేలాది మంది లండన్ కు ప్రయాణం చేశారు. సురక్షితమైన ప్రదేశం ఉంటే తప్ప మ్యాచ్ చూసేందుకు రావొద్దని స్కాట్లాండ్ ప్రభుత్వం, లండన్ మేయర్ సాదిక్ ఖాన్ చేసిన హెచ్చరికలను అభిమానులు బేఖాతరు చేస్తూ వేలాది మంది వెళ్లారు. వెంబ్లే మ్యాచ్ కి ఎంట్రీకి కఠినమైన ఆంక్షలు పెట్టారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూయించాలి లేదా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ చూపించాలి. అయినప్పట్టికి అభిమానులు తండోపతండాలు వచ్చేశారు. కరోనా బారిన పడ్డవారిలో ఎక్కువ మంది 20 నుంచి 39ఏళ్ల వయసు వారే ఉన్నారు. ఇక ప్రతి 10 కేసుల్లో 9మంది పురుషులే ఉన్నారు.

స్కాట్లాండ్ లో బుధవారం రికార్డు స్థాయిలో(3వేల 887) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒక్కసారిగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరగడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. కరోనా కేసులు అనూహ్యంగా పెరగడానికి డెల్టా వేరియంట్ ముఖ్య కారణం అని అధికారులు తేల్చారు. ఆ దేశంలోని అతి పెద్ద సిటీ అయిన గ్లాస్గోలో డెల్టా వేరియంట్ తొలుత వెలుగుచూసింది. ఆ తర్వాత వేగంగా వ్యాప్తి చెందింది.