Golden Visa: గోల్డెన్ వీసాతో యూకేకు 254మంది ఇండియన్ మిలియనీర్లు

గోల్డెన్ వీసా వాడుకుని 2008 నుంచి 254మంది ఇండియన్ మిలియనీర్లు యూకేలో సెటిల్ అయ్యారట. యూకేకు చెందిన యాంటీ కరప్షన్ ఛారిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇండియన్లు టైర్ 1(ఇన్వెస్టర్) వీసా పొందిన ధనిక దేశాల్లో ఏడోదిగా ఉంది.

Golden Visa: గోల్డెన్ వీసాతో యూకేకు 254మంది ఇండియన్ మిలియనీర్లు

Golden Visas

Golden Visa: గోల్డెన్ వీసా వాడుకుని 2008 నుంచి 254మంది ఇండియన్ మిలియనీర్లు యూకేలో సెటిల్ అయ్యారట. యూకేకు చెందిన యాంటీ కరప్షన్ ఛారిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇండియన్లు టైర్ 1(ఇన్వెస్టర్) వీసా పొందిన ధనిక దేశాల్లో ఏడోదిగా ఉంది. చైనా 4వేల 106మందితో టాప్ 1లోఉండగా, రష్యా (2వేల 526), హాంకాంగ్ (692), యునైటెడ్ స్టేట్స్ (685), పాకిస్తాన్ (283), కజక్‌స్తాన్ (278)లు ఇండియా కంటే ముందు స్థానంలో ఉన్నారు.

ఇండియా కంటే తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా 223మందితో, టర్కీ 221 మందితో, ఈజిప్ట్ 206మందితో టాప్ 10జాబితాలో ఉన్నారు. గోల్డెన్ వీసా అంటే యూకేలో రిజిష్టర్ అయిన కంపెనీల్లో పెట్టుబడులతో అధికారికంగా అనుమతి పొందడం. 2మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెడితే మూడేళ్ల పాటు యూకేలో ఉండటానికి వెంటనే హక్కు దక్కించుకోవచ్చు. దాని తర్వాత రెండేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.

ఇదిలా ఉంటే 10మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెడితే ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ పొందేసి రెండేళ్ల పాటు లేదా మూడేళ్ల పాటు ఉండిపోవచ్చు. ఆ తర్వాత యూకే సిటిజన్‌షిప్ అవకాశం దక్కించుకోవచ్చు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుడిగా ఉండీ యూకే చెక్కేశారు. ఈ మేర జరిగిన విచారణలో 2015లో ఇన్వెస్టర్ వీసాకు అప్లై చేసినట్లు తెలిసింది.

ఆ సమయంలో యూకేలో ఉండటానికి సూపర్ రిచ్ పర్సన్లకు 2మిలియన్ పౌండ్ల పెట్టుబడితో నివాస హక్కులు దక్కించుకోవడం ఈజీ అయిపోయింది. 2015 నుంచి 2018 కాలం మధ్యలో ఇష్యూ అయిన వీసాలపై నిర్వహించి ప్రస్తుత నిబంధనలు కఠినం చేశారు. పొటెన్షియల్ నేషనల్ సెక్యూరిటీ రిస్క్ కు సంబంధించిన హోం ఆఫీస్ దీనిపై సమీక్ష నిర్వహించింది.