3,000 Year Oldest City : ఇసుకలో సమాధి అయిన 3000 ఏళ్ల నాటి నగరం..తవ్వకాల్లో బైటపడ్డ గోల్డెన్ సిటీ

3,000 Year Oldest City : ఇసుకలో సమాధి అయిన 3000 ఏళ్ల నాటి నగరం..తవ్వకాల్లో బైటపడ్డ గోల్డెన్ సిటీ

3,000 Year Oldest City

3,000 Year Old Lost Golden City  : ఈజిప్టు ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. అత్యంత ప్రాచీన చరిత్రకలిగిన దేశం. అటువంటి చారిత్రాత్మక ఈజిప్టులో 3 వేల ఏళ్ల నాటి అతి పురాతన నగరం ఇసుక కింద సమాధి అయిపోయింది. ఆ నగరం గురించి ఎంతోమంది పరిశోధకులు తవ్వకాలు చేపట్టినా ఇసుకలో సమాధి అయిపోయాని ఆ నగరాన్ని గుర్తించలేకపోయారు. ఎన్నో దేశాలకు చెందిన సీనియర్ పురాతత్వవేత్తలు ఎన్నో తవ్వకాలు చేపట్టినా.. ఆ నగరాన్ని గుర్తించలేకపోయారు. కానీ సమాధి అయిన చరిత్ర ఎప్పుడోకప్పుడు వెలుగులోకి వస్తుంది.

అలాగే ఈజిప్ట్ సైంటిస్టులు ఇసుకలో సమాధి అయిన ఆ నగరాన్ని వెలుగులోకి తెచ్చారు. తమ తొలియత్నంలోనే ఈ విజయాన్ని సాధించారు. అంతేకాదు..ఆ నగరంలోని కొన్ని అద్భుతమైన..అరుదైన ఘట్టాలను వెలికితీయగలిగారు. ఆ ప్రాచీన నగరం పేరు ‘అటెన్’.శాండ్ అండర్ వరల్డ్ నుంచి ‘అటెన్’ అరుదైన చరిత్రను ప్రముఖ చరిత్రకారుడు, పురాతత్వవేత్త జాహీ హవాస్ జాహీ హవాస్ ఆధ్వర్యంలోని పురాతత్వవేత్తల బృందం ఈ నగరాన్ని గుర్తించి..వెలుగులోకి తీసుకొచ్చింది.

కొన్ని వేల ఏళ్లవుతున్నా ‘అటెన్’ నగరపు గోడలు చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం. ఈ నగరంలోని బేకరీ, సమాధులు, నివాస సముదాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. టుటెంకమిన్ సమాధిని గుర్తించిన తర్వాత.. అతి ముఖ్యమైన చరిత్రను వెలిక తీయటం ఇదేనని ఈజిప్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నగరానికి సంబంధించిన వివరాలను జాహీ హవాస్ పలు విషయాలను వెల్లడించారు. ఇది ఆనాటి గోల్డెన్ సిటీ అని తెలిపారు.

రాజుల లోయగా పిలిచే లగ్జర్ కు దగ్గర్లో దీనిని గుర్తించామని..ఈ నగరం ఎమెనోటెప్ 3 కాలానికి చెందినదని వెల్లడించారు. ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని..దాదాపు ఏడు నెలలుగా కొనసాగిన ఈ తవ్వకాల్లో నగరంతో పాటు ఆనాడు ఉపయోగించిన ఆభరణాలు లభ్యమయ్యాయనీ..వాటితోపాటు బీటిల్ పురుగులకు సంబంధించిన ఆనవాళ్లు, మట్టి ఇటుకలను వెలికి తీశామని తెలిపారు. ఆ ఇటుకలపై ఎమెనోటెప్ 3 చిత్రాలు ముద్రించి ఉన్నట్టు పురాతత్వవేత్తలు గుర్తించారు. నివాస సముదాయాల్లోని ఇళ్లలో ప్రజలు నిత్యం వాడే పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, పూలు పెట్టుకునే వాజులు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు.

ఎన్నో దేశాలకు చెందిన పురాతత్వవేత్తలు తవ్వకాలు జరిపినా.. ఈ నగరాన్ని గుర్తించలేకపోయారని పురాతత్వ శాఖ మాజీ మంత్రి కూడా అయిన హవాస్ వెల్లడించారు. 2020 సెప్టెంబర్ లో రామ్సెస్ 3, ఎమెనోటెప్ 3కి సంబంధించిన గుళ్ల మధ్య తవ్వకాలు మొదలుపెట్టామని..కేవలం వారం వ్యవధిలోనే ఈ ప్రాచీన నగరాన్ని గుర్తించామని తెలిపారు. చాలా చోట్ల ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు బయటకు కనిపించాయని..దీంతో మరింత ఉత్సాహంగా..జాగ్రత్తగా తవ్వకాలను కొనసాగించగా ఈ నగరం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

ఎమెనోటెప్ 3 యూఫ్రేట్స్ నుంచి సూడాన్ వరకు నాలుగు దశాబ్దాల పాటు పరిపాలించాడని క్రీస్తు పూర్వం 1354లో చనిపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. తన పరిపాలనలో ఎన్నో కట్టడాలను నిర్మించాడని అంటారు. లగ్జర్ కు సమీపంలో ఎమెనోటెప్ 3, అతడి భార్యకు సంబంధించిన రెండు భారీ రాతి విగ్రహాలను ప్రతిష్టించాడు ఎమెనోటెప్ 3. దానినే కొలోజీ ఆఫ్ మెమ్నన్ అని పిలుస్తుంటారు.