అమెరికాలో కాల్పులు: ఆరుగురు మృతి

  • Published By: vamsi ,Published On : February 27, 2020 / 02:12 AM IST
అమెరికాలో కాల్పులు: ఆరుగురు మృతి

ప్రపంచంలోని అతిపెద్ద బీర్ తయారీ కంపెనీలలో ఒకటైన మోల్సన్ కూర్స్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ఆరుగురు చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కంపెనీలో మాజీ ఉద్యోగి అని తెలుస్తుంది. అమెరికాలోని మిల్వాకికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి షూటింగ్ జరిగిపినట్లుగా అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన అనంతరం.. తనకు తానే తుపాకీతో కాల్చుకుని దుండగుడు మరణించాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ వ్యాప్తిపై వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాల్పుల ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో కనీసం 600 మంది కాంప్లెక్స్ లో పనిచేస్తున్నారు అని అధికారులు చెప్పారు. చనిపోయినవారి వివరాలను వారి కుటుంబాలకు తెలియజేశారు. 

అయితే అసలు కాల్పులకు కారణం ఏంటీ? అనేది మాత్రం తెలియరాలేదు. దుండగుడు అసలు ఎలా గన్‌తో వచ్చాడు అనే విషయాలను పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలిగించారనే కారణంతో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రాధమికంగా అంచనా వేశారు పోలీసులు