Casino : కాసినోలో రూ.40కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. క్లబ్‌పై కేసు నమోదు

మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త లండన్‌లోని మేఫెయిర్ క్యాసినోలో 40కోట్ల రూపాయలను కోల్పోయాడు.

Casino : కాసినోలో రూ.40కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. క్లబ్‌పై కేసు నమోదు

Casino

Casino- Trending News: మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త లండన్‌లోని మేఫెయిర్ క్యాసినోలో 40కోట్ల రూపాయలను కోల్పోయాడు. అయితే, మొత్తం డబ్బును కోల్పోయిన సదరు వ్యక్తి క్యాసినోపై కేసు నమోదు చేశాడు. తన ఓటమికి క్యాసినో నిర్వహించిన క్లబ్‌ను ముద్దాయిగా పేర్కొంటూ కేసు నమోదు చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. మలేషియాకు చెందిన వ్యాపారవేత్త లిమ్ హాన్ జో 2015లో వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లాడు. అక్కడ ఓ క్యాసినోలో జూదం ఆడడం మొదలుపెట్టాడు. ప్రైవేట్ సభ్యుల క్లబ్ ఆస్పినాల్స్‌లో 72 గంటల పాటు గేమ్‌లో పాల్గొని సదరు పారిశ్రామికవేత్త 3.9 మిలియన్ యూరోలు (రూ. 39,21,04,060) కోల్పోయాడు.

దాదాపుగా రూ.40 కోట్లు నష్టపోయిన సదరు వ్యక్తి.. డబ్బు మొత్తం అయిపోయాక క్యాసినోపై కేసు పెట్టాడు. క్యాసినో తప్పిదం వల్ల తన డబ్బు మొత్తం పోయిందని ఆరోపించాడు.

క్యాసినో నిర్వాహకులు తనను జూదం ఆడకుండా ఆపాలని, కానీ అలా చేయకుండా జూదం ఆడేలా ప్రేరేపించి భారీగా డబ్బు కోల్పోయేలా చేసిందని కేసు పెట్టాడు. గ్యాంబ్లింగ్ యాక్ట్ 2005 కింద కేసు నమోదు చేశాడు.

లేటెస్ట్‌గా ఈ అంశంపై కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు లిమ్ పిటిషన్‌ను కొట్టివేసి క్యాసినోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యాపారవేత్త లిమ్ మలేషియాలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరు. అతనికి మలేషియా, లండన్‌లో కూడా ఆస్తులు ఉన్నాయి.