షాకింగ్.. భార్యను చంపింది తానేనని ఒప్పుకున్న భర్త.. కానీ, ఆ మృతదేహం 1600ఏళ్ల క్రితం నాటిది

ఇంగ్లండ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఓ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే విషయం బయటపడింది. భూమి నుంచి బయటపడ్డ మహిళ మృతదేహం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే, ఆ డెడ్ బాడీ ఇప్పటిది కాదు. చాలా పురాతనమైంది. ఒక్కముక్కలో చెప్పాలంటే 1600ఏళ్ల క్రితం నాటిది. షాకింగ్ గా ఉంది కదూ.. అసలేం జరిగిందంటే..

షాకింగ్.. భార్యను చంపింది తానేనని ఒప్పుకున్న భర్త.. కానీ, ఆ మృతదేహం 1600ఏళ్ల క్రితం నాటిది

Body Turned Out To Be 1,600 Years Old

Body Turned Out To Be 1,600 Years Old: ఇంగ్లండ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఓ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే విషయం బయటపడింది. భూమి నుంచి బయటపడ్డ మహిళ మృతదేహం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే, ఆ డెడ్ బాడీ ఇప్పటిది కాదు. చాలా పురాతనమైంది. ఒక్కముక్కలో చెప్పాలంటే 1600ఏళ్ల క్రితం నాటిది. షాకింగ్ గా ఉంది కదూ.. అసలేం జరిగిందంటే..

ఇంగ్లండ్ లోని చెషైర్ లో 1959లో జరిగిన ఘటన ఇది. ఆమె పేరు మలైకా డీ ఫెర్నాండెజ్. చిత్రాలు గీసే కళాకారిణి. పైగా ట్రావెలర్. ఈ క్రమంలో ఓ సారి ప్రయాణంలో ఆమెకు పీటర్ రెన్ బార్డ్ అనే ఎయిర్ లైన్ ఉద్యోగి పరిచయం అయ్యాడు. పరిచయం ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని పీటర్ అడగ్గానే.. మలైకి ఓకే చెప్పింది. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే పెళ్లి అయిపోయింది.

skull

కట్ చేస్తే..నాలుగు నెలల తర్వాత పెళ్లి పెటాకులైంది. ఎవరి దారి వారు చూసుకున్నారు. మలైకా.. యథావిధిగా ప్రపంచ పర్యటనలు షురూ చేసింది. పీటర్ ఏమో.. చెషైర్ లోని తన కాటేజ్ లోనే ఉండసాగాడు. ఇది జరిగిన రెండేళ్లకు.. మలైకి అదృశ్యం అయ్యింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ముందుగా మాజీ భర్త పీటర్ నే అనుమానించారు. విచారణలో భాగంగా పోలీసులు పీటర ఇంట్లో సోదాలు జరిపారు. అతడి గార్డెన్ మొత్తం తవ్వి చూవారు. కానీ, మలైకాకి సంబంధించి ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. అలా ఆ కేసు 20ఏళ్ల పాటు మిస్టరీగానే ఉండిపోయింది. ఈ క్రమంలో పీటర్ కాటేజీకి సమీపంలోని నేలలో(పీట్ బాగ్) శరీర భాగాలు దొరికాయి. దీంతో మళ్లీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పీటర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే మలైకాని మర్డర్ చేసినట్లు విచారణలో పీటర్ అంగీకరిచాడు.

కాగా పీట్ బాగ్ నేలను సేంద్రీయ పదార్ధం, నాచుతో చేస్తారు. ఈ తరహా నేలలో యాసిడ్ ఉంటుంది. మృతదేహాల సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఆ నేల నుంచి పోలీసులు ఓ మహిళ పుర్రె సేకరించారు. అది మలైకాదే అని భావించారు. ఆ పుర్రెని ల్యాబ్ కి పంపి టెస్టులు చేశారు. టెస్టులో వారికి షాకింగ్ విషయం తెలిసింది. ఆ మృతదేహం ఇప్పటిది కాదు. 1600ఏళ్ల క్రితం నాటిదని తెలిసి విస్తుపోయారు. 1600ఏళ్ల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఓ కేసుని విచారిస్తుంటే, వారికి మరో కేసు తగిలింది. 1600ఏళ్లు దాటినా ఇంకా ఆ పుర్రె పాడవకుండా ఉండటం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

తొలుత ఆ తల 30 నుంచి 50ఏళ్ల వయసు గల మహిళదని పోలీసులు అనుకున్నారు. కానీ, 1600ఏళ్ల క్రితం నాటిదని తెలిసి దిమ్మతిరిగింది. ఆ పుర్రె తన మాజీ భార్యది కాదనే విషయం తెలియగానే.. పీటర్.. యూటర్న్ తీసుకున్నాడు. తాను ఆమెని హత్య చేయలేదని చెప్పాడు. కానీ పోలీసుల ముందు అతడి పప్పులు ఉడకలేదు. మలైకాను తానే గొడ్డలితో నరికి చంపినట్టు ఒప్పుకున్నాడు. విడిపోయిన తర్వాత మలైకి రోజూ తన కాటేజీకి వచ్చేదని, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నేను గే అనే విషయాన్ని బయటపెడతానని తనను బెదిరించేది అని చెప్పాడు. ఇంగ్లండ్ లో గే అనేది చట్టరిత్యా నేరం. దీంతో విసిగిపోయిన తాను ఆమెని హత్య చేశానని చెప్పాడు.

మొత్తంగా.. ఆ తల ఓ మహిళదే. కానీ, ఇప్పటిది కాదు. 16వందల ఏళ్ల క్రితమే చనిపోయింది. దీనిపై ల్యాబ్ లో పరిశోధనలు జరపగా.. ఆ పుర్రె రోమన్ సమయానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.