కరోనా వైరస్‌కు మందు కనిపెట్టండి..రూ. కోటి ఇస్తా – జాకీచాన్

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 05:13 PM IST
కరోనా వైరస్‌కు మందు కనిపెట్టండి..రూ. కోటి ఇస్తా – జాకీచాన్

ప్లీజ్..కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్ ఏదైనా కనిపెట్టండి..ఇలా చేసిన వారికి రూ. కోటి బహుమతిగా ఇస్తానంటూ ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈయన పెద్దమొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా వైరస్ బారిన పడి వందలాదిగా మృత్యువాత పడుతుండడంతో జాకీచాన్ రెస్పాండ్ అయ్యారు. వైరస్‌ను అధిగమించడానికి సైన్స్, టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు, వీలైనంత త్వరగా దీనికి మందు కనిపెట్టాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

వ్యక్తి లేదా..ఏదైనా సంస్థ వ్యాక్సిన్ కనిపెడితే..వారికి రూ. 1 మిలియన్ యువాన్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే..ఇదేదో డబ్బుగా చూడకూడదని, వైరస్‌న బారిన పడి ఎంతో మంది మృతి చెందుతుండడం బాదేస్తోందన్నారు. 

ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే..ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇతర దేశాలకు పాకుతోంది. ప్రధానంగా చైనాలోని వూహాన్ నగరం స్మశానాన్ని తలపిస్తోంది. వందలాది మృతి చెందుతుండగా..వేలాది మంది వైరస్‌ బారిన పడి..ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిని అడ్డుకొనే మార్గం తెలియలేక చైనా ప్రభుత్వం జట్టుపట్టుకొంటోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు అక్కడి ప్రభుత్వానికి.

దాదాపు వెయ్యి మంది బలి చెందారని అంచనా. మరో 40 వేల మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో మంది వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యాధికి మందు కనుక్కొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయినా..ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ కనిపించలేదు.