15 pens..15 paintings Girl : 15పెన్నులతో ఒకేసారి 15 చిత్రాలు గీసిన బాలిక ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా

15పెన్నులతో ఒకేసారి 15 చిత్రాలు గీసిన బాలిక ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తన ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన ఆ బాలిక వీడియోను షేర్ చేశారు.

15 pens 15 paintings girl..Anand Mahendra : ఒకేసారి 15 పెన్నులతో ఒకేసారి 15మంది దేశ భక్తుల చిత్రాలు గీసిన ఓ బాలిక ప్రతిభకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఎక్కడ ప్రతిభ ఉన్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా తన పెయింటింగ్ ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన బాలిక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్‌ చేయటంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 5 లక్షల పైగా వ్యూస్‌ లభించాయి. ఈ వైరల్‌ వీడియో సదరు బాలిక తన మాస్టర్‌పీస్‌ పక్కన నిలుచుని ఉండటం కనిపించింది.

ఈ బాలిక ప్రతిభ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సింది. అటువంటిది హిడెన్ టాలెంట్లను సైతం తన ట్విట్టర్ ద్వారా పరిచయం చేసే ఆనంద్ మహీంద్రా ఫిదా అవ్వకుండా ఉంటారు. ఆమె ఇలా పోస్ట్ చేశారలో లేదో అలా వ్యూస్ వచ్చి పడ్డాయీ వీడియోకు. ఈ వీడియోలో సదరు బాలిక స్టిక్స్‌కు వాటి కింద పెన్నులను అమర్చింది. కాన్వాస్‌ పీస్‌ను 15 భాగాలుగా డివైడ్‌ చేసి పలువురు స్వాతంత్ర సమరయోధుల పెయింటింగ్స్‌ వేయడం ప్రారంభించింది. ఆమె చేతులు కదలికలు..కాసేపటికే 15 పెన్నులతో 15మంది దేశ భక్తుల ఫోటోలను వేసిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే ఆమె ప్రతిభకు గిన్నిస్ రికార్డు వరించింది.

అసలు ఇదెలా సాధ్యం..? ఆమె నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్‌..అయినా ఒకేసారి 15 చిత్రపటాలను వేయడం కళ కంటే గొప్పదైన అద్భుతం..ఇది నిజమని అక్కడున్న వారెవరైనా నిర్ధారిస్తే ఆ బాలికకు స్కాలర్‌షిప్‌తో పాటు అవసరమైన సాయం అందిస్తా అని పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బాలిక ప్రతిభ అమోఘం అంటూ ప్రశంసిస్తున్నారు. బాలిక టాలెంట్ నమ్మలేకపోతున్నామని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారో యూజర్.

 

ట్రెండింగ్ వార్తలు