చైనాలో మరో గని ప్రమాదం : టన్నెల్‌లో 20మంది మృతి

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 10:14 AM IST
చైనాలో మరో గని ప్రమాదం : టన్నెల్‌లో 20మంది మృతి

బీజింగ్ : చైనాలోని ఓ మైనింగ్ ప్రమాదాలలో కూలీల బతుకులు సజీమ సమాధి అయిపోతున్నాయి. మైనింగ్స్ లో జరుగున్న ప్రమాదాలు ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న క్రమంలో మరో గని ప్రమాదం సంభవించింది.  ఉత్తర మంగోలియా ప్రాంతంలోని ఇన్‌ మెన్‌ మైనింగ్‌ సంస్థలో శనివారం  (ఫిబ్రవరి 23)ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందగా మారో 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జున్హూ తెలిపింది. 
 

జింక్, వెండి గనుల తవ్వకాలలో భాగంగా 50 మంది కార్మికులతో బస్సును భూగర్భంలోనికి తరలించే సమయంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో టన్నెల్‌ గోడలను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ఐదుగురు ఆస్పత్తిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా విపత్తు నిర్వహణ దళ అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బ్రేకులు విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. 
 

పూర్తి స్థాయిలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ గ్యాస్‌ పేలుళ్లు, వరదల కారణంగా చైనా దేశవ్యాప్తంగా టన్నెల్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. పది రోజుల కిందట వాయవ్య చైనా ప్రాంతంలోని ఓ గనిలో పైకప్పు కూలిపోవడంతో 21 మంది కూలీలు మరణించారు. షాంగ్జి ప్రావిన్సులో లిజియాగావ్ బొగ్గు గనిలో భూగర్భ ప్రాంతంలో 87 మంది కూలీలు పనిచేస్తుండగా, హఠాత్తుగా పైకప్పు కూలిపోయింది. 19 మంది అక్కడికక్కడే మరణించగా, 66 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గత అక్టోబరులోనూ తూర్పు షడాంగ్ ప్రావిన్సుల్లో సొరంగం కూలిన ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు.