Asteroid : తాజ్మహాల్ సైజులో గ్రహాశకలం.. భూమి వైపు దూసుకొస్తుందా?
తాజ్ మహల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉన్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకుపోతోందని నాసా తెలిపింది.
Asteroid : తాజ్ మహల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉన్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకుపోతోందని నాసా తెలిపింది. 1994 డబ్ల్యూఆర్ఐ2 అనే పేరుగల గ్రహశకలం సోమవారం భూమికి సమీపంగా వెళ్లనుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 1994లో ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పుడు భూమి నుంచి సుమారు 3.8 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది.
కాగా ఈ గ్రహశకలాన్ని US ఖగోళ శాస్త్రవేత్త కరోలిన్ S. షూమేకర్ గుర్తించారు. ఈ గ్రహశకలం పరిమాణం లండన్లోని బిగ్ బెన్ గడియారం కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని చెబుతున్నారు. లేదా, మరొక కోణంలో, గ్రహశకలం కొలత భారతదేశంలోని తాజ్ మహల్ వలె, అదే పరిమాణం ఎత్తులో ఉందని నాసా తెలిపింది.
ఈ గ్రహశకలం భూమిని ఢీకొడితే 77 మెగాబైట్ల TNTని ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది హిరోషిమాపై వేసిన బాంబు కంటే 3,333 రెట్లు అధికశక్తిని విడుదల చేస్తుందని తెలిపారు. కాగా నాసా యొక్క ఆస్టరాయిడ్ వాచ్ డాష్బోర్డ్, భూమిని సమీపించే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం డాష్బోర్డ్ ఇది ఐదు ప్రధాన గ్రహశకలాలను ట్రాక్ చేస్తుంది.
చదవండి : Delhi Pollution..NASA : ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో చెప్పిన నాసా