అందరూ చనిపోతారా : భూమికి భారీ ముప్పు

భూమికి భారీ ముప్పు పొంచి ఉందా? భూమి అంతమైపోతుందా? ముక్కలు ముక్కలవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోసారి భూమి డేంజర్ లో పడింది.

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 05:15 AM IST
అందరూ చనిపోతారా : భూమికి భారీ ముప్పు

భూమికి భారీ ముప్పు పొంచి ఉందా? భూమి అంతమైపోతుందా? ముక్కలు ముక్కలవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోసారి భూమి డేంజర్ లో పడింది.

భూమికి భారీ ముప్పు పొంచి ఉందా? భూమి అంతమైపోతుందా? ముక్కలు ముక్కలవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోసారి భూమి డేంజర్ లో పడింది. భూమికి గ్రహశకలం ముప్పు పొంచి  ఉంది. 2029లో ఈ ప్రమాదం ఉంది. అపోఫిస్ అనే గ్రహశకలం(ఆస్ట్రాయిడ్) భయపెడుతోంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుంది. భూమికి 32వేల కిమీ దూరం నుంచి గ్రహశకలం వెళ్లనుంది. ఆ సమయంలో ఢీకొడితే  భూమి ముక్కలవుతుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ‘అపోఫిస్‌’ అనే గ్రహశకలం ఏప్రిల్‌ 13, 2029న భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని పరిశోధకులు అంచనా వేశారు. దీనికి ఈజిప్టు దేవుడు ‘గాడ్‌ ఆఫ్‌  చవోస్‌’ పేరు పెట్టారు.

కొన్ని లక్షల ఏళ్ల కిందట భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు సహా జంతుజాలం అంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ముప్పే భూమికి పొంచి ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. స్పేస్‌ఎక్స్‌  సీఈవో ఎలన్‌ మస్క్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత శక్తి, సామర్థ్యం మన దగ్గర లేవని ట్వీట్ చేశారు. 

అపోఫిస్(Apophis)..ఇదో గ్రహశకలం(Asteroid).. పొడవు 1100 అడుగులు. ఇది కనుక భూమిని ఢీకొడితే 15 వేల అణుబాంబుల శక్తి విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విస్ఫోటనం వల్ల భూమి భౌగోళిక  మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ గ్రహశకలం భూమి వైపు వచ్చేప్పుడు సూర్యుడి తరహాలో ప్రకాశిస్తుందని తెలిపారు. ఈ గ్రహశకలం భూమిని తాకితే సగం మానవళి అంతం కావొచ్చని  భయపడుతున్నారు. ప్రస్తుతం ఇది గంటలకు 52వేల మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోంది. జూన్ 6, 2027 నాటికి భూమిని సమీపిస్తుంది. 

భూమి అంతమైపోతుంది అనే వార్తలతో నాసా అంగీకరించడం లేదు. అదే సమయంలో పూర్తిగా కొట్టివేయడం లేదు. గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందనే మాట వాస్తవమేనని తెలిపింది. దాని వల్ల భూమికి ఎలాంటి  ప్రమాదం ఉండబోదని, అది భూమికి 23వేల 363 మైళ్ల దూరం నుంచి వెళ్లే అవకాశం ఉందని వివరించింది. అయితే దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్విస్ట్ ఇచ్చింది. 2012లో భూమి  అంతమైపోతుందని, ప్రజలంతా చనిపోతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ వదంతులే అని తెలుసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. అలాగని భూమి పూర్తిగా సేఫ్ అని మాత్రం చెప్పలేమని  శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమికి కొన్ని వేల మైళ్ల దూరంలో తిరుగుతున్న గ్రహశకలాలతో ఏదో ఒక రోజు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.