ఎలుగుబంటి జోస్యం నిజమైంది..బైడెన్ గెలిచారు

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 10:35 AM IST
ఎలుగుబంటి జోస్యం నిజమైంది..బైడెన్ గెలిచారు

bear prophecy came true joe biden Win : ఎలుగుబంటి జోస్యం నిజమైంది. అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్‌ జో బైడెన్‌ విజయం సాధిస్తారని మూడు రోజులక్రితం ఓ సైబీరియా ఎలుగుబంటి జోస్యం చెప్పింది. అది చెప్పినట్టుగానే జో బైడెన్‌.. డోనాల్డ్‌ ట్రంప్‌పై ఘన విజయం సాధించారు. 290 ఎలక్టోరల్‌ ఓట్లతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్‌ ఎన్నికయ్యారు. ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్ల వద్దే నిలిచిపోయారు.



2016 ఎన్నికల్లో కూడా ఈ ఎలుగుబంటి చెప్పినదే నిజమై హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొందారు. అదే ఎలుగుబంటి ఈసారి ట్రంప్‌ వైపు కాకుండా బైడెన్‌ను ఎంచుకున్నది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు సైబీరియాలోని క్రాస్నోయార్స్క్‌లోని రాయెవ్ రోచీ జూలో నివసిస్తున్న రెండు పులులు, ఒక ఎలుగుబంటితో జోస్యం చెప్పించారు.



రష్యా నిపుణులు పుచ్చకాయపై అభ్యర్థుల ఫొటోలు ముద్రించి రెండు పులులు, ఒక ఎలుగుబంటి ముందు ఉంచారు. విచిత్రంగా రెండు పులులతోపాటు ఎలుగుబంటి కూడా జో బైడెన్‌దే విజయమని సంకేతాలిచ్చాయి. ఇప్పుడు వాటి జోస్యమే నిజమైంది. ఈ జూ ఎపిసోడ్‌ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో బైడెన్‌కు కావాల్సినంత ప్రచారం వచ్చినట్లైందని అంతా చర్చించుకుంటున్నారు.