Bombing : పాక్ సరిహద్దుల్లో అత్మహుతిదాడి

అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల మోతమోగింది. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు చనిపోగా 19మంది గాయపడ్డారు.

Bombing : పాక్ సరిహద్దుల్లో అత్మహుతిదాడి

Bombing

Bombing : అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల మోతమోగింది. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు చనిపోగా 19మంది గాయపడ్డారు. దాడి వివరాలను పాకిస్తాన్ పోలీసులు మీడియాకు తెలిపారు.గాయపడిన 19మందిలో 17మంది గార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పాకిస్తాన్‌కు నైరుతి దిశలో ఉన్న క్వెట్టా నగరంలో ఈ ఘటన జరిగింది. అఫ్ఘాన్ కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉన్నట్లు తెలిపారు.క్వెట్టాలో సుమారు ఐదులక్షల మంది హజారాలు నివసిస్తుంటారని, వీరు కూరగాయలు విక్రయిస్తుంటారని అన్నారు. వీరిని టార్గెట్ గా చేసుకొని ఇస్లామిక్ స్టేట్, సున్నీ మిలిటెంట్ గ్రూప్ లు దాడులు జరుపుతుంటాయని అన్నారు.

సాయుధుడై వచ్చిన తీవ్రవాది సైనికుల సమీపంలోకి వచ్చి పేల్చుకున్నాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు అధికారులు మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.